సీఎం జగన్ చెప్పే చెప్పే సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి అంత నిజమని రాష్ట్ర BC వింగ్ అధ్యక్షుడు, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. జగన్ సామాజిక న్యాయం అనటం తప్ప చేసేదేమి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలను వంచించారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ జంగా.. సీఎం జగన్ కి చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ మాయ మాటలు నమ్మి అందరం మోసపోయామనీ వాపోయారు.