Parnasala: వనవాసాన శ్రీ రాముడు నడయాడిన నేల "పర్ణశాల"-parnashala is the area where lord rama walked ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Parnasala: వనవాసాన శ్రీ రాముడు నడయాడిన నేల "పర్ణశాల"

Parnasala: వనవాసాన శ్రీ రాముడు నడయాడిన నేల "పర్ణశాల"

HT Telugu Desk HT Telugu
Jan 22, 2024 06:55 AM IST

Parnasala: సాక్షాత్తు ఆ శ్రీ రాముడు నడయాడిన నేలగా "పర్ణశాల" ప్రసిద్ధికెక్కింది. సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ రాముడు సంచరించిన ఆనవాళ్లు సైతం కనిపిస్తాయి.

శ్రీరాముడు నడయాడిన నేలగా పర్ణశాల
శ్రీరాముడు నడయాడిన నేలగా పర్ణశాల

Parnasala: పర్ణశాలలో సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ రాముడు సంచరించిన ఆనవాళ్లు సైతం కనిపిస్తాయి. ఆంజనేయ స్వామి పాద ముద్రలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రావణుడు సీతమ్మను అపహరించుకుపోయింది ఇక్కడి నుంచే అని పురాణాలు చెబుతున్నాయి.

yearly horoscope entry point

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రానికి 32 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం రామాయణంలో పర్ణశాల ప్రస్తావన ఉన్నట్లు పెద్దలు చెబుతారు.

శ్రీరాముడు 14 ఏళ్ల పాటు సీతమ్మతో కలిసి వనవాసం చేశాడు. అయితే అలా వనవాసానికి వెళ్ళినపుడు ఈ పర్ణశాల ప్రాంతంలోనే నివసించినట్లు ప్రతీతి. అక్కడ నిత్యం ప్రవహించే వాగు వద్ద సీతమ్మ స్నానం చేసినట్లు చెబుతారు. ఆ తరువాత ఇక్కడి రథంగుట్టపై ఆమె ధరించే చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినట్లు ఒక కథనం.

పురాణగాధల ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో పర్ణశాలలో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అలాగే అక్కడ కొంతకాలం నివశించాడు. అందుకే ఆ ఆశ్రమానికి "పర్ణశాల" అని పేరు వచ్చింది. ఎందుకంటే దాని చుట్టూ భారీగా చెట్లు కనిపిస్తాయి. "పర్ణ" అంటే ఆకులు అని అర్ధం. అలాగే శాల అంటే ఇల్లు అని అర్ధం.

రాముడు ఇక్కడికి సమీపంలోని "శివకేవ్" అనే గుహలో శివునికి ప్రార్థనలు చేసేవాడని చెబుతారు. పర్ణశాల చరిత్ర వేదకాలం నాటిది. వేదాలు అడవుల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ గురించి ప్రస్తావించాయి.

పర్ణశాల చుట్టూ ఉన్న అడవులు పవిత్రమైనవిగా పరిగణిస్తారు. భారతదేశంలోని ఏడు పవిత్ర నదుల్లో ఒకటిగా వేదాలలో పేర్కొన్న ఈ గ్రామం గోదావరి నది ఒడ్డున ఉండటం విశేషం.

బౌద్ధ కాలంతో ముడిపడిన ప్రాంతం..

పర్ణశాల కూడా బౌద్ధ కాలంతో ముడిపడి ఉంది. 17వ శతాబ్దానికి చెందిన తహసీల్దార్ భక్త రామదాసు రాముడికి అంకితం చేసిన భద్రాచలం ఆలయాన్ని నిర్మించారు. బ్రిటిష్ కాలంలో పర్ణశాల నిజాం హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది.

ఈ గ్రామం వ్యవసాయ ఉత్పత్తులకు, ముఖ్యంగా వరి, చెరకుకు ప్రసిద్ధి చెందింది. పర్ణశాల ప్రజలు వెదురు, ఇతర సహజ వస్తువులను ఉపయోగించి హస్తకళలు, అలంకార వస్తువులను తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇటీవలి కాలంలో పర్ణశాల ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది.

శ్రీరాముడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశంగా భావించే శ్రీరామ దేవాలయం ప్రధాన ఆకర్షణ. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం చుట్టూ పచ్చని అడవులు ఉన్నాయి. ఈ గ్రామం ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. పర్ణశాల కొండ, కొత్తగూడెం జల పాతాలు ట్రెక్కింగ్ తో పాటు ప్రకృతి నడకలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు.

(sరిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)

Whats_app_banner