(1 / 7)
టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం శాఖ. హైదరాబాద్ నుంచి కాకతీ. హెరిటేజ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.రెండు రోజుల టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను పేర్కొంది.
(2 / 7)
ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఏసీ మినీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ డేట్స్ ను టూరిజం శాఖ ప్రకటిస్తుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వివరాలను తెలుసుకోవచ్చు.
(3 / 7)
వీకెండ్ లో ఈ ప్యాకేజీ ఉంటుంది. వివరాలు చూస్తే శనివారం(ఫస్ట్ డే) ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. 8:30గంటలకు భువనగిరి ఫోర్టకు చేరుకుంటారు. టిఫిన్ తర్వాత 9:45 AM గంటలకు యాదాద్రి దర్శనం ఉంటుంది. 11:30 గంటలకు జైన్ ఆలయాన్ని సందర్శిస్తారు.
(4 / 7)
మధ్యాహ్నం 12:00 గంటలకు పెంబర్తిలో షాపింగ్ ఉంటుంది. 1:30 PMకు వరంగల్ హరిత కాకతీయ హోటల్ కు వస్తారు. లంచ్ తర్వాత వేయి స్తంభాల ఆలయానికి వెళ్తారు. వరంగల్ ఫోర్టులోని లైట్ ప్రదర్శనను వీక్షిస్తారు. రాత్రి వరంగల్ లోనే బస చేస్తారు.
(5 / 7)
రెండో రోజు (ఆదివారం) రామప్పకు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్నవరం వెళ్తారు.
లక్నవరం నుంచి బయల్దేరుతారు. బోటింగ్, లంచ్ ఉంటుంది. అక్కడ్నుంచి
హన్మకొండలోని హరిత హోటల్ కి వస్తారు. టీ విరామం ఉంటుంది. 5:30 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
(6 / 7)
ఈ ప్యాకేజీ ధరలను చూస్తే పెద్దలకు రూ. 3449 గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2759గా నిర్ణయించారు. ఈ ధరలో దర్శనంతో పాటు హోటల్ లో వసతి కూడా కల్పిస్తారు.
(Image Source TG Tourism Twitter )(7 / 7)
హైదరాబాద్ - కాకతీయ హెరిటేజ్ టూర్ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=260&journeyDate=2024-09-14&adults=2&childs=0
(Image Source TG Tourism Website )ఇతర గ్యాలరీలు