(1 / 5)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంపై ఫోకస్ పెట్టింది. వైజాగ్లో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. విశాఖ అందాలను ఆకాశం నుంచి చూసే అద్బుత అవకాశం కల్పిస్తోంది.
(2 / 5)
కైలాసగిరి నుంచి విశాఖ అందాలను ఆస్వాదించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే స్కై సైక్లింగ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం కొన్ని రోజులుగా ట్రయల్ నిర్వహిస్తున్నారు.
(3 / 5)
గాల్లో తేలుతూ.. విశాఖ సాగర తీరం అందాలను చూసేందుకు పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. విశాఖ నగర వాసులు స్కై సైక్లింగ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
(4 / 5)
అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. మంచు కురిసే వేళలో అద్భుతమైన అరకు అందాలను చూడొచ్చు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
(5 / 5)
ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 20, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
ఇతర గ్యాలరీలు