(1 / 6)
ఏపీ, తెలంగాణలో భానుడి ప్రతాపం పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే ఏకంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
(unsplash.com)(2 / 6)
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పటికే వాతావరణశాఖ… ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
(unsplash.com)(3 / 6)
ఓవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని పేర్కొంది.
(unsplash.com)(4 / 6)
ఏప్రిల్ 6వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతవరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఏప్రిల్ 7, 8వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(unsplash.com)(5 / 6)
ఏప్రిల్ 9వ తేదీ ఉదయం వరకు ఈ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.
(unsplash.com)(6 / 6)
మరోవైపు ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఎండతో పోల్చితే…. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
(unsplash.com)ఇతర గ్యాలరీలు