Article 370 : ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ-supreme court to hear pleas challenging the abrogation from of article 370 from aug 2nd ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Article 370 : ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ

Article 370 : ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ

Sharath Chitturi HT Telugu
Jul 11, 2023 11:52 AM IST

ఆర్టికల్​ 370 రద్దు పిటిషన్లపై.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

Supreme court hearing on Article 370 abrogation : జమ్ముకశ్మీర్​కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని కేంద్రం రద్దు చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి విచారించనుంది సుప్రీంకోర్టు. సంబంధిత వ్యాజ్యాలపై రోజువారీ విచారణ చేపట్టనున్నట్టు మంగళవారం ప్రకటించింది సర్వోన్నత న్యాయస్థానం.

వారి పేర్లు తొలగింపు..

"ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2 ఉదయం 10:30 గంటల నుంచి విచారణ జరుపుతుంది. సోమ, శుక్ర మినహించి.. రోజువారీ పద్ధతిలో విచారణ జరుగుతుంది," అని భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ తెలిపారు.

ఆర్టికల్​ 370ని రద్దు చేస్తూ.. 2019 ఆగస్టులో భారత పార్లమెంట్​ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జమ్ముకశ్మీర్​ పునర్విభజన చట్టానికి కూడా ఆమోద ముద్రవేసింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. అనంతరం జమ్ముకశ్మీర్​లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వెలుగులోకి వచ్చింది.

Article 370 abrogation Supreme court : ఆ తర్వాత.. ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అప్పట్లో విచారణ జరిపింది అత్యున్నత న్యాయస్థానం. తిరిగి.. మూడేళ్ల తర్వాత ఆగస్టు 2 నుంచి విచారణను కొనసాగించనుంది.

‘సరైన నిర్ణయమే తీసుకున్నాము..’

ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా గతంలో వ్యాజ్యలు దాఖలు చేసిన ఐపీఎస్​ అధికారి షా బైజల్​, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్​లు.. తమ పేర్లను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తాజాగా అంగీకరించింది.

Supreme court latest news : మరోవైపు జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ మేరకు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్​ను దాఖలు చేసింది. టెర్రర్​ నెట్​వర్క్​పై సమర్థమైన పోరాటానికి తమ నిర్ణయం ఉపయోగపడిందని వెల్లడించింది. వీధుల్లో హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని, రాళ్లు రువ్వే ఘటనలు పూర్తిగా కనుమరుగైపోయాయాని పేర్కొంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం