PM Modi tributes to Heeraben : తల్లి హీరాబెన్​కు మోదీ నివాళి-pm narendra modi pays respect to his mother heeraben modi at gandhinagar residence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Narendra Modi Pays Respect To His Mother Heeraben Modi At Gandhinagar Residence

PM Modi tributes to Heeraben : తల్లి హీరాబెన్​కు మోదీ నివాళి

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 30, 2022 09:04 AM IST

Heeraben Modi passed away : గుజరాత్​కు చేరుకున్న ప్రధాని మోదీ.. తల్లి హీరాబెన్​కు నివాళులర్పించారు. 100ఏళ్ల హీరాబెన్​ మోదీ.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

హీరాబెన్​ పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ
హీరాబెన్​ పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ

PM Modi tributes to Heeraben : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన తల్లి హీరాబెన్​ మోదీకి నివాళులర్పించారు. హీరాబెన్​ మరణ వార్త అందిన వెంటనే.. ఢిల్లీ నుంచి గుజరాత్​కు బయలుదేరిన మోదీ.. శుక్రవారం ఉదయం తన తల్లి భౌతికకాయానికి నమస్కారాలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

100ఏళ్ల హీరాబెన్​ మోదీ.. అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతు.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితమే.. అహ్మదాబాద్​లోని యూఎన్​ మెహ్తా హార్ట్​ హాస్పిటల్​లో చేరారు హీరాబెన్​. ఆ సమయంలో మోదీ కూడా ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హీరాబెన్​ మోదీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకటి- రెండు రోజుల్లో డిశ్ఛార్జ్​ కూడా అవుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు మోదీ.

ఆసుపత్రి నుంచి గాంధీనగర్​ ఇంటికి హీరాబెన్​ భౌతికకాయం చేరుకోగా.. అదే సమయంలో మోదీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తల్లి పార్థివదేహాన్ని ప్రధాని మోదీ స్వయంగా మోశారు. అనంతరం ఇంట్లో.. ఆమెకు నివాళులర్పించారు.

ప్రముఖుల సంతాపం..

Heeraben Modi passed away : హీరాబెన్​ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పలువురు నేతలు. హీరాబెన్​ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

"ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణ వార్త విని బాధ కలిగింది. ఓ వ్యక్తి జీవితంలో మొదటి స్నేహం, మొదటి టీచర్​ మాతృమూర్తే. అలాంటి తల్లి కోల్పోవడం అనేది. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన విషయం. కుటుంబాన్ని పోషించడం కోసం హీరా బా పడిన కష్టాలు స్ఫూర్తిదాయకం. ఆమె త్యాగాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఈ కష్టకాలంలో దేశం మొత్తం మోదీకి అండగా నిలుస్తుంది," అని ట్వీట్​ చేశారు అమిత్​ షా.

PM Modi Heeraben Modi news : "ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణం చాలా బాధ కలిగించింది. ఇది తీరని లోటు. తల్లిలేని లోటును ఎవరు తీర్చలేరు. ప్రధాని మోదీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి," అని కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు.

“ప్రధాని మోదీ తల్లి హీరా బా మరణ వార్త విని బాధ కలిగింది. ఈ కష్టకాలంలో ప్రధాని మోదీకి, ఆయన కుటుంబానికి నేను నా ప్రేమను పంచుతున్నాను,” అని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

రాహుల్​ గాంధీతో పాటు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు కూడా మోదీకి సానుభూతిని తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం