Parliament Winter Session : డిసెంబర్​ 7 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు-parliament winter session to begin on december 7 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Parliament Winter Session To Begin On December 7

Parliament Winter Session : డిసెంబర్​ 7 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 19, 2022 08:15 AM IST

Parliament Winter Session 2022 : డిసెంబర్​ 7 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. డీసెంబర్​ 29తో ముగియనున్నాయి.

పార్లమెంట్​
పార్లమెంట్​

Parliament winter session 2022 schedule dates : ఈ ఏడాది.. పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు డిసెంబర్​ 7న ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

డిసెంబర్​ 7న మొదలయ్యే పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు.. అదే నెల 29న ముగియనున్నాయి. మొత్తం మీద ఈసారి శీతాకాల సమావేశాలు.. 17 రోజుల పాటు జరగనున్నాయి.

"2022 పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్​ 7 నుంచి 29 వరకు జరుగుతాయి. 23 రోజుల వ్యవధిలో 17 సిట్టింగ్స్​ ఉంటాయి. వివిధ అంశాలపై చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాము. నిర్ణయాత్మక చర్చలు సాగుతాయని ఆశిస్తున్నాము," అని కేంద్రం మంత్రి ట్వీట్​ చేశారు.

పలువురు సిట్టింగ్​ ఎంపీల మృతిపై సంతాపం తెలుపుతూ.. తొలి రోజు కార్యకలాపాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన సిట్టింగ్​ ఎంపీల్లో ఎస్​పీ దిగ్గజ నేత ములాయం సింగ్​ యాదవ్​ కూడా ఉన్నారు.

కొవిడ్​ రూల్స్​ లేకుండా..

Parliament winter session 2022 : కొవిడ్​ సంక్షోభం నేపథ్యంలో.. 2020 నుంచి ఆంక్షల వలయంలోనే పార్లమెంట్​ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఈసారి రూల్స్​ ఉండకపోవచ్చని తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటం, పార్లమెంట్​ సిబ్బంది పూర్తిగా టీకాలు వేసుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

రాజ్యసభకు ఇంతకాలం ఛైర్మన్​గా విధులు నిర్వహించిన వెంకయ్య నాయుడు.. వర్షకాల సమావేశాల్లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత.. జగ్​దీప్​ ధన్​ఖర్​.. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్​ బాధ్యతలు తీసుకోనున్నారు.

వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి.

వర్షాకాల సమావేశాలు..

Parliament Monsoon session 2022 : 2022 పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు.. జులై 18- ఆగస్టు 8 మధ్య జరిగాయి. 22 రోజుల్లో 16 సెషన్స్​ జరిగాయి. సమావేశాల్లో భాగంగా లోక్​సభలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది కేంద్రం. మొత్తం మీద 7 బిల్లులు లోక్​సభలో గట్టెక్కాయి. రాజ్యసభలో 5 బిల్లులకు ఆమోదం లభించింది. ఒక బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది.

గత పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో లోక్​సభ ఉత్పాదకత 48శాతం, రాజ్యసభ ఉత్పాదకత 44శాతంగా నమోదైంది.

WhatsApp channel

సంబంధిత కథనం