Triple Talaq : సైబర్ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్!
Odisha triple talaq case : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకుంది ఓ మహిళ. ఆ విషయం తన భర్తకు చెప్పింది. అతను ఆమెకు ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇచ్చాడు! ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
Odisha triple talaq case : ఇండియాలో ట్రిపుల్ తలాక్పై 2019లోనే నిషేధం పడింది. అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్ తలాక్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇచ్చాడు ఓ వ్యక్తి.

ఇదీ జరిగింది..
32ఏళ్ల మహిళ.. తన కుటుంబంతో కలిసి ఒడిశాలోని కేంద్రపుర జిల్లాలో నివాసముంటోంది. ఆమెకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారికి 16-17ఏళ్ల వయస్సు ఉంటుంది.
Triple Talaq case in Odisha : కాగా.. ఇటీవలే ఆ మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. అయితే.. సైబర్ మోసానికి ఆమె రూ. 1.5లక్షల వరకు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఆమె ఎవరికి చెప్పలేదు. లోలోపల చాలా బాధపడింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు.
గుజరాత్లో ఉన్న ఆమె భర్త ఈ నెల 1న ఆ మహిళకు ఫోన్ చేశాడు.. ఆ రూ. 1.5లక్షల గురించి ప్రశ్నించాడు. అప్పుడు ఆమె నిజం చెప్పేసింది. సైబర్ మోసానికి తాను డబ్బులు పోగొట్టుకున్నట్టు అంగీకరించింది. వెంటనే ఫోన్లో 'తలాక్' అన్న పదాన్ని మూడుసార్లు ఉచ్చరించాడు ఆ వ్యక్తి. డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు.
వరకట్న వేధింపులు.. ట్రిపుల్ తలాక్
Odisha crime news : బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ట్రిపుల్ తలాక్ విషయాన్ని చెప్పింది. అంతేకాకుండా.. తాను అనేకమార్లు వరకట్నం వేధింపులకు గురైనట్టు ఫిర్యాదు చేసింది. సంబంధిత వ్యక్తిపై కేంద్రపుర సదర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సరోజ్ కుమార్ సాహూ.. వరకట్న వేధింపుల చట్టం, ముస్లిం మహిళల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చట్టం ప్రకారం.. దోషిగా తేలిన వారికి గరిష్ఠంగా 3ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
తలాక్ అన్న పదాన్ని భర్త మూడుసార్లు ఉచ్చరిస్తే.. భార్యతో విడాకులు తీసుకున్నట్టు! ఇది దేశంలో అనేక శతాబ్దాలుగా ఆచరణలో ఉంది. కాగా 2017లో ట్రిపుల్ తలాక్పై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. కానీ అనేక వర్గాల నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు మద్దతు లభించింది. చాలా మంది ముస్లిం మహిళలు కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
సంబంధిత కథనం