New Chief Justice: నాడు తండ్రి.. నేడు కుమారుడు.. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్-justice dy chandrachud takes oath as 50th chief justice of india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Chief Justice: నాడు తండ్రి.. నేడు కుమారుడు.. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్

New Chief Justice: నాడు తండ్రి.. నేడు కుమారుడు.. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 10:32 AM IST

Justice DY Chandrachud: దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త చీఫ్ జస్టిస్‌గా చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సీజేఐగా ప్రమాణం చేయిస్తున్న భారత రాష్ట్రపతి
జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సీజేఐగా ప్రమాణం చేయిస్తున్న భారత రాష్ట్రపతి (PTI)

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ యు.యు.లలిత్ తర్వాత చంద్రచూడ్ 50వ చీఫ్ జస్టిస్ అయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10, 2024 వరకు ఉంటుంది. జస్టిస్ చంద్రచూడ్ సుప్రీం కోర్టులో ఇప్పటి వరకు రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.

జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 11, 1959న జన్మించారు. మే 13, 2016న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అతని తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ భారతదేశ 16వ ప్రధాన న్యాయమూర్తిగా 44 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 1978 నుండి జూలై 11, 1985 వరకు పనిచేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ అక్టోబరు 31, 2013 నుండి సుప్రీం కోర్టులో ఆయన నియామకం వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మార్చి 29, 2000 నుండి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్ 1998 నుండి బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. జూన్ 1998లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కుమారుడు కూడా సీజేఐగా కావడం భారత చరిత్రలో ఇదే తొలిసారి. తండ్రి వైవీ చంద్రచూడ్ సుదీర్ఘకాలం సీజేఐగా కొనసాగి చరిత్ర సృష్టించారు. సుమారు ఏడేళ్ల ఐదు నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్‌లో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్, డీయూ క్యాంపస్‌లో ఎల్ఎల్‌బీ చదివారు.

IPL_Entry_Point

టాపిక్