Bihar student death : టీచర్ చితకబాదడంతో.. 7ఏళ్ల విద్యార్థి మృతి!
Bihar student death in hostel : బీహార్లోని ఓ హాస్టల్లో ఓ 7ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ దారుణంగా కొట్టడంతోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది!
Bihar student death in hostel : బిహార్లో దారుణ ఘటన జరిగింది. హోంవర్క్ చేయలేదన్న కారణంగా ఓ విద్యార్థిని టీచర్ చితకబాదినట్టు, ఫలితంగా ఆ విద్యార్థి మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది..
7ఏళ్ల ఆదిత్య యాదవ్.. బిహార్ సహస్ర జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో 4వ తరగతి చదువుకుంటున్నాడు. కాగా గురువారం ఉదయం హాస్టల్ రూమ్లో అతడిని అపస్మారక స్థితిలో గుర్తించారు అక్కడి విద్యార్థులు. వెంటనే అతడిని సుజీత్ కుమార్ అనే టీచర్ వద్దకు తీసుకెళ్లారు. ఆదిత్యను ఆసుపత్రిలో విడిచిపెట్టాలని విద్యార్థులకు చెప్పాడు. కొంతసేపటి తర్వాత.. బాలుడి తండ్రి ప్రకాశ్ యాదవ్కు సుజీత్ కుమార్ ఫోన్ చేశాడు. తన బిడ్డ అపస్మారక స్థితిలో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు.
Bihar crime news : మరోవైపు ఆదిత్య యాదవ్ను విద్యార్థులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. శరీరంపై గాయాలేవీ లేవని, బాలుడి మరణానికి గల కారణాలు.. పోస్టుమార్టం నివేదికలో తెలుస్తాయని వైద్యులు స్పష్టం చేశారు.
టీచరే చంపేశాడా..?
ఆదిత్య యాదవ్ మరణ వార్తతో తోటి విద్యార్థులు షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఓ విషయాన్ని వెల్లడించారు.
Bihar student death : "ఆదిత్య యాదవ్ను బుధవారం సాయంత్రం సుజీత్ కుమార్ టీచర్ దారుణంగా కొట్టారు. హోంవర్క్ చేయలేదని కర్రతో చితకబాదాడు. ఆ తర్వాత ఆదిత్య యాదవ్ గురువారం నిద్ర లేవలేదు," అని 7ఏళ్ల బాలుడి స్నేహితుడు వెల్లడించాడు.
"ఆదిత్య యాదవ్ను టీచర్ వరుసగా రెండు రోజులు కొడుతూనే ఉన్నాడు. హోంవర్క్ చేయలేదని ఓసారి, పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని ఇంకోసారి దారుణంగా కొట్టాడు," అని మరో విద్యార్థి తెలిపాడు.
నిందారోపణ ఎదుర్కొంటున్న సుజీత్ కుమార్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న సమచారం విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
'నా బిడ్డ చనిపోయాడు..'
ఈ ఘటనపై ఆదిత్య యాదవ్ తండ్రి ప్రకాశ్ యాదవ్ స్పందించారు.
Bihar latest news : "ఆదిత్య యాదవ్ హోలీ రోజు ఇంటికి వచ్చాడు. 14వ తేదీన హాస్టల్కు తిరిగి వెళ్లాడు. గురువారం ఉదయం నాకు ఫోన్ వచ్చింది. ఆదిత్య స్పృహ కోల్పోయాడని చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళుతున్నట్టు వివరించారు. నేను వెళ్లేసరికే ఆదిత్య చనిపోయాడు. సుజీత్ కుమార్ పారిపోయాడు. తప్పు చేయకపోతే సుజీత్ కుమార్ ఎందుకు పారిపోయాడు?" అని ప్రకాశ్ యాదవ్ అన్నారు.
మరోవైపు ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం