Tanushree Dutta: బాలీవుడ్ మాఫియా న‌న్ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తుంది...న‌టి త‌నుశ్రీద‌త్తా ఆరోప‌ణ‌లు...-tanushree dutta accuses bollywood mafia trying to kill her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tanushree Dutta: బాలీవుడ్ మాఫియా న‌న్ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తుంది...న‌టి త‌నుశ్రీద‌త్తా ఆరోప‌ణ‌లు...

Tanushree Dutta: బాలీవుడ్ మాఫియా న‌న్ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తుంది...న‌టి త‌నుశ్రీద‌త్తా ఆరోప‌ణ‌లు...

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 08:51 AM IST

బాలీవుడ్ మాఫియా తనను చంపడానికి ప్రయత్నిస్తున్నదనినటి తనుశ్రీదత్తా. ఆరోపించింది. వారి బెదిరింపులకు భయపడేది లేదంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. తనుశ్రీదత్తా పోస్ట్సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తనుశ్రీదత్తా.
తనుశ్రీదత్తా. (twitter)

2005 లో విడుదలైన ఆషిక్ బనాయా అప్నే సినిమాతో కథానాయికగా కెరీర్ ను మొదలుపెట్టింది తనుశ్రీదత్తా. ఆ తర్వాత 36 చైనా టౌన్, స్పీడ్ తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్ర సినిమాలో నటించింది. అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగలేకపోయింది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ 2018లో తనుశ్రీదత్తా ఆరోపించడం సంచలనం సృష్టించింది.

హార్న్ ఒకే ప్లీజ్ సినిమా షూటింగ్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నది. నానా పటేకర్ పై కేసు పెట్టడంతో పాటు సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సంప్రదించానని కానీ తనకు న్యాయం జరగలేదని పేర్కొన్నది. 2019లో నానా పటేకర్ కు ఈ మీటూ ఆరోపణల నుండి పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. తాజాగా మరోమారు తనుశ్రీదత్తా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనను బాలీవుడ్ మాఫియా చంపడానికి ప్రయత్నిస్తున్నదని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

తనను కొందరు టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పేర్కొన్నది. గత ఏడాది తాను తాగే నీళ్లలో పనిమనిషి స్టెరాయిడ్లు,నిషేదిత మెడిసిన్స్ కలపడంతో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానని చెప్పింది. మే నెలలో ఉజ్జయిని వెళ్లానని ఆ సమయంలో తన కారు బ్రేకులను ఫెయిల్ చేయడంతో రెండు సార్లు యాక్సిడెంట్ కు గురయ్యానని పేర్కొన్నది. ఈ ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొన్నది. ముంబై తిరిగి వచ్చి సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా తనకు అడ్డంకులను సృష్టిస్తున్నారని తనుశ్రీ దత్తా పేర్కొన్నది.

తన అపార్టెమెంట్ బయట పలు అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పింది. బాలీవుడ్ మాఫియా ఈ కుట్రలకు పాల్పడుతున్నదని అన్నది. బాలీవుడ్ లోని అగ్ర నటులుగా చెలామణి అవుతున్న కొందరి నిజమైన స్వరూపాలను మీటూ సమయంలో తాను బయటపెట్టానని, అది ఓర్చుకోలేక ఆ నిందితులు తనను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నది. వారి బెదిరింపులకు భయపడి తాను ఆత్మహత్య చేసుకోనని తనుశ్రీదత్తా చెప్పింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్