Upasana Apologies to Sidharth and Kiara: సిద్ధార్థ్-కియారాకు క్షమాపణలు చెప్పిన ఉపాసన.. ఎందుకో తెలుసా?-ram charan wife upasana konidela apologies to newly weds sidharth and kiara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Upasana Apologies To Sidharth And Kiara: సిద్ధార్థ్-కియారాకు క్షమాపణలు చెప్పిన ఉపాసన.. ఎందుకో తెలుసా?

Upasana Apologies to Sidharth and Kiara: సిద్ధార్థ్-కియారాకు క్షమాపణలు చెప్పిన ఉపాసన.. ఎందుకో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Feb 08, 2023 10:58 AM IST

Upasana Apologies to Sidharth and Kiara: బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్-కియారా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి సినీ ప్రముఖుల నుంచి అభినందనల వర్షం వెల్లువెత్తింది. అయితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల క్షమాపణలు చెప్పింది.

సిద్ధార్థ్-కియారా
సిద్ధార్థ్-కియారా

Upasana Apologies to Sidharth and Kiara: బాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ మంగళవారం నాడు పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఎట్టకేలకు వివాహం చేసుకుంది. పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ నోరు మెదపని వీరు.. అందరూ అనుకున్నట్లుగానే మంగళవారం నాడు మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారు. ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు కొంతమంది మాత్రమే హాజరయ్యారు. కరణ్ జోహార్, కత్రీనా కైఫ్, ఆలియా భట్, వరుణ్ ధావన్, ఉపాసన తదితరులు వీరికి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే ఉపాసన మాత్రం సిద్ధార్థ్-కియారాకు అభినందనలతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది.

"కంగ్రాచూలేషన్స్ మీకు. చాలా అందంగా ఉన్నారు నేను అక్కడకు రానందుకు క్షమించండి. మీ ఇద్దరికీ అందరి ప్రేమాభిమానాలు దక్కాలి." అని ఉపాసన ఇన్‌స్టా వేదికగా స్పందించింది. ముందుగా అనుకున్న కమిట్మెంట్స్ కారణంగా ఉపాసన.. సిద్ధార్థ్-కియారా పెళ్లికి హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది.

కియారా-సిద్ధార్థ్ ఇద్దరూ తమ వివాహం గురించి సోషల్ మీడియా వేదికగా వేరువేరుగా తెలియజేశారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలపై సెలబ్రెటీలు, అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఆలియా భట్ అభినందనలు చెప్పగా.. చూసేందుకు చాలా అందంగా ఉన్నారని విక్కీ కౌషల్ పోస్ట్ పెట్టారు. ఇక అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవు. డ్రీమ్ కపుల్ ఒక్కటయ్యారంటూ విభిన్నంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. మాకిష్టమైన జంట ఒక్కటైందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం కియారా అద్వానీ శంకర్-రామ్ చరణ్ కాంబోలోని ఆర్‌సీ15లో నటిస్తోంది. ఇది కాకుండా బాలీవుడ్‌వలో సత్యప్రేమ్ కీ కథ అనే చిత్రంలో కార్తిక్ ఆర్యన్ సరసన చేస్తోంది. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. మరోపక్క సిద్ధార్థ్ మల్హోత్రా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. ఇందులో శిల్పా శెట్టి కీలక పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా యోధ అనే మరో ప్రాజెక్టులోనూ నటిస్తున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం