Gold Rate Today August 28th : మరింత తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా-gold rate today on august 28th 2024 gold rate down silver rate rise in hyderabad telangana vijayawada andhra pradesh ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today August 28th : మరింత తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

Gold Rate Today August 28th : మరింత తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

Anand Sai HT Telugu

Today Gold Price : దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

నేటి బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 దిగొచ్చి.. రూ. 66,930కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,940గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,69,300కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,693గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,020కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,030గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,30,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,302గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,080గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,170గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,930 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,020గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,930గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,020గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,930గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,020గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.66,930గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,020గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,980గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,070గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,930గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,020గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 8,860గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 88,600కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 88,500గా ఉండేది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 93,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 88,600.. బెంగళూరులో రూ. 83,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు బుధవారం పడిపోయాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 100 తగ్గి రూ. 25,710కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,810గా ఉండేది. హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,710గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.