Gold and Silver prices today : అక్టోబర్​ 4 : మరింత పెరిగిన పసిడి ధరలు- నేటి వెండి రేటు ఎంతంటే..-gold and silver prices today 4 october 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : అక్టోబర్​ 4 : మరింత పెరిగిన పసిడి ధరలు- నేటి వెండి రేటు ఎంతంటే..

Gold and Silver prices today : అక్టోబర్​ 4 : మరింత పెరిగిన పసిడి ధరలు- నేటి వెండి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు వృద్ధిచెందాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (PTI)

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 వృద్ధి చెంది.. రూ. 77,560కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 77,450గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 పెరిగి.. రూ. 7,75,600గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 71,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 71,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 పెరిగి, రూ. 7,11,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,110గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,710గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,560గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,560గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 71,110గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,560గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,110గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,560గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 77,610గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,110గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,560గా ఉంది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య అనిశ్చితి, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,500గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 95,000గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,01,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,000.. బెంగళూరులో రూ. 90,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి.. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 పెరిగి రూ. 26,900 చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,770గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం