(1 / 6)
ఏపీలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో నిప్పులు కొలిమిలా వేడి ఉంటుంది. ఉక్కపోత, వేడగాల్పులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
(2 / 6)
ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
(3 / 6)
రేపు(ఏప్రిల్ 25) రాష్ట్రంలో 54 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
(4 / 6)
ఎల్లుండి(ఏప్రిల్ 26న) రాష్ట్రంలోని 36 మండలాల్లో తీవ్రవడగాల్పులు,157 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
(5 / 6)
ఈరోజు 69 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లవద్దని సూచించింది.
(6 / 6)
ఇవాళ విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45°C, వైయస్సార్ జిల్లా బలపనూర్ లో 44.9°C, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3°C, నంద్యాల జిల్లా మహానందిలో 44.2°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇతర గ్యాలరీలు