
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రాణహిత - చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి వద్దనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామన్నారు. కాళేశ్వరంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

