Netherlands in T20 World Cup Super 12: యూఏఈ చేతిలో ఓడిన నమీబియా.. సూపర్ 12కు నెదర్లాండ్స్
Netherlands in T20 World Cup Super 12: యూఏఈ చేతిలో ఓడిన నమీబియా టీ20 వరల్డ్కప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు నమీబియా ఓటమితో గ్రూప్ ఎ నుంచి నెదర్లాండ్స్ సూపర్ 12కు వెళ్లింది.
గురువారం (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. 149 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 రన్స్ మాత్రమే చేసింది. ఇటు నమీబియా ఓడిపోవడంతో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన నెదర్లాండ్స్ సూపర్ 12కు వెళ్లింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక చేతుల్లో నెదర్లాండ్స్ ఓడింది.
ఆ టీమ్ నెట్ రన్రేట్ మైనస్లో ఉంది. నమీబియా నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో యూఏఈపై గెలిస్తే చాలు తర్వాతి స్టేజ్కు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఓటమితో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. దీంతో గ్రూప్ ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ టీమ్స్ సూపర్ 12 స్టేజ్కు వెళ్లాయి. ఇక గ్రూప్ బి నుంచి ఎవరు వెళ్తారనేది శుక్రవారం (అక్టోబర్ 21) తేలనుంది.
శ్రీలంక ఎ1గా, నెదర్లాండ్స్ ఎ2గా సూపర్ 12లోకి అడుగుపెట్టాయి. ఎ1 టీమ్ గ్రూప్ 1లోకి, ఎ2 టీమ్ గ్రూప్ 2లోకి వెళ్తాయి. ఆ లెక్కన ఇండియా ఉన్న గ్రూప్ 2లోకి నెదర్లాండ్స్ టీమ్ వెళ్తుంది. నెదర్లాండ్స్తో ఇండియా అక్టోబర్ 27న తలపడనుంది. ఇక గ్రూప్ బీలో టాప్ ఉండే టీమ్ కూడా ఇండియా ఉన్న గ్రూప్ 2లోకే వెళ్తుంది. ఆ టీమ్తోనూ లీగ్ స్టేజ్లో ఇండియా ఓ మ్యాచ్ ఆడుతుంది. అది ఎవరు అన్నది శుక్రవారం తేలనుంది.