Vaishakha Amavasya 2023 । వైశాఖ అమావాస్య రోజునే సూర్యగ్రహణం.. పితృ దోష పరిహారాలు చూడండి!-vaishakha amavasya 2023 solar eclipse come together know pitru dosha remedies on this rare phenomenon ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vaishakha Amavasya 2023 । వైశాఖ అమావాస్య రోజునే సూర్యగ్రహణం.. పితృ దోష పరిహారాలు చూడండి!

Vaishakha Amavasya 2023 । వైశాఖ అమావాస్య రోజునే సూర్యగ్రహణం.. పితృ దోష పరిహారాలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Apr 20, 2023 10:36 AM IST

Vaishakha Amavasya 2023: ఈరోజు వైశాఖ అమావాస్య, సూర్య గ్రహణం రెండూ ఒకేరోజు వచ్చాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం దీని ప్రభావం ఏమిటి? ఈరోజు ఎలాంటి నియమాలు ఆచరించాలో ఇక్కడ తెలుసుకోండి.

Vaishakha Amavasya 2023
Vaishakha Amavasya 2023 (Unsplash)

Vaishakha Amavasya 2023: ఈరోజు ఏప్రిల్ 20న వైశాఖ అమావాస్య వచ్చింది, ఇదే రోజున సూర్యగ్రహణం సంభవించింది. అమావాస్య చంద్రుడు ఈరోజు సూర్యగ్రహణానికి (Solar Eclipse 2023) కారణం అవుతున్నాడు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇది చాలా అరుదైన సంఘటన. ఈరోజు సూర్యగ్రహణం ఉదయం 07:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. అయితే, సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనందున, ఇక్కడ సూతక కాలం అనేది లేదు. అందువల్ల వైశాఖ అమావాస్య సందర్భంగా నిర్వహించే అన్ని ఆచారాలను పంచాంగం ప్రకారం నిర్వహించవచ్చుకోవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అధ్యాత్మికవేత్తల ప్రకారం, వైశాఖ అమావాస్య తిథి నాడు వివిధ పరిహారాలను ఆచడం ద్వారా పితృ దోషం నుంచి బయటపడవచ్చు. పితృ దోషం కలిగి ఉండటం వలన జీవితంలో అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మొత్తం కుటుంబం పురోగతి దెబ్బతింటుంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం అమావాస్య నాడు పడుతున్నందున, సూర్యగ్రహణం ముగిసే ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పరిహారాలు పాటిస్తే, పిత్ర దోషం తొలగిపోతుంది. పితృ దోషం నుండి విముక్తి పొందడానికి ఎలాంటి ఆచారాలు పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.

వైశాఖ అమావాస్య రోజున పితృ దోష నివారణ పరిహారాలు

  • ముందుగా స్నానం ఆచరించండి, ఆ తరువాత, మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి మీ చేతికి కుశ దారాన్ని కట్టుకోండి లేదా కుశాన్ని తీసుకొని నీటితో సమర్పించండి.
  • మీరు మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృ స్తోత్రాన్ని (స్తుతి స్తోత్రం) పఠించవచ్చు. ఈ స్తోత్రంలో మీరు మీ పూర్వీకులను స్తుతిస్తారు, ఇలా చేయడం ద్వారా మీ పూర్వీకుల అనుగ్రహం మీకు ప్రసాదించడం జరుగుతుంది.
  • అమావాస్య నాడు, మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పిండ దానం లేదా శ్రాద్ధ కర్మలను కూడా నిర్వహింవచ్చు. ఈ ఆచారం వారిని సంతృప్తిపరచగలదు. ఇది వారి పిల్లలు లేదా వారసులను సంతోషకరమైన జీవితం పొందేలా ఆశీర్వదిస్తుంది.
  • మీ పూర్వీకులను సంతృప్తి పరచడానికి, మీరు వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి సమర్పించండి. ఈ ఆహారాన్ని కనీసం ఐదు మందితో పంచుకోండి. లేదా కాకులు, ఆవులు, కుక్కలు, ఇతర పశుపక్షాదులకు కూడా అందించవచ్చు. శాస్త్రాల ప్రకారం, పశుపక్షాదులకు ఆహారాన్ని సమర్పించడం ద్వారా, వాటి రూపంలో మీ పూర్వీకులు ఆ ఆహారాన్ని స్వీకరిస్తారు.
  • మీ పూర్వీకులకు ఇష్టమైన వస్తువులను పేద బ్రాహ్మణుడికి దానం చేయండి. దీంతో వారు కూడా సంతోషిస్తున్నారు. ఈ చర్య మీకు సంతోషాన్ని ప్రసాదిస్తుంది.

జ్యోతిష్యుల ప్రకారం, పూర్వీకులను సంతృప్తిపరచడం ద్వారా వారి వారసులకు, పిల్లలకు వారి తర్వాతి తరాలకు వారి ఆశీస్సులు లభిస్తాయి. ఇది వారి పురోగతికి, సంతోషకరమైన జీవితానికి దోహదపడుతుంది. పూర్వీకులు శాంతి సంతృప్తి పొందకపోతే, అది ఎల్లప్పుడూ పితృ దోషం శాపం రూపంలో ఉంటుంది. ఇది కుటుంబ ప్రగతిపై ప్రభావం పడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్