Revanth Reddy Counter to KTR: కేటీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే నువ్వు మంత్రి అయ్యావ్ -tpcc chief revanth reddy counter to minister ktr comments ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tpcc Chief Revanth Reddy Counter To Minister Ktr Comments

Revanth Reddy Counter to KTR: కేటీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే నువ్వు మంత్రి అయ్యావ్

Mar 15, 2023, 10:51 PM IST HT Telugu Desk
Mar 15, 2023, 10:51 PM , IST

  • Revanth Reddy Padayatra Updates: రేవంత్ రెడ్డి పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలోని దుబ్బ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుందన్నారు. నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు...? ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం,  అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చారని ఆరోపించారు.  

(1 / 6)

అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం,  అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చారని ఆరోపించారు.  

మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది.. కానీ ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని విమర్శించారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమన్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని ప్రజలను కోరారు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారని దుయ్యబట్టారు.  

(2 / 6)

మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది.. కానీ ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని విమర్శించారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమన్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని ప్రజలను కోరారు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారని దుయ్యబట్టారు.  

ఆదానీ, ప్రధాని వేర్వేరు కాదు... ఆదానీయే ప్రధాని... ప్రధానే ఆదానీ అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ పాదయాత్ర క్యాంపులో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.... సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క బృందాన్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.  కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అయితే అదానీ సంపద మాత్రం 819 శాతం పెరిగిందన్నారు.  2014 తరువాత మోదీ దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఆదానీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

(3 / 6)

ఆదానీ, ప్రధాని వేర్వేరు కాదు... ఆదానీయే ప్రధాని... ప్రధానే ఆదానీ అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ పాదయాత్ర క్యాంపులో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.... సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క బృందాన్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.  కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అయితే అదానీ సంపద మాత్రం 819 శాతం పెరిగిందన్నారు.  2014 తరువాత మోదీ దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఆదానీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆదానీ కుంభకోణం పై ఈడీ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి చేశారు. జేపీసీని నియమించి బీజేపీ తమ నీతిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుతో ఆదానీ, ప్రధాని చీకటి ఒప్పందం బయటపడిందన్నారు.

(4 / 6)

ఆదానీ కుంభకోణం పై ఈడీ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి చేశారు. జేపీసీని నియమించి బీజేపీ తమ నీతిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుతో ఆదానీ, ప్రధాని చీకటి ఒప్పందం బయటపడిందన్నారు.

బుధవారం  కామారెడ్డి జిల్లా పిట్ల సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చలువే అన్న రేవంత్ రెడ్డి.... రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీకాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.  

(5 / 6)

బుధవారం  కామారెడ్డి జిల్లా పిట్ల సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చలువే అన్న రేవంత్ రెడ్డి.... రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీకాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.  

"తాము(కాంగ్రెస్) తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. 24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే..దేనికైనా సిద్ధం. మీరేం చేశారో.. మేమేం చేశామో మీడియా మిత్రుల సమక్షంలో చర్చకు సిద్ధమా..?" అని కేటీఆర్ ప్రశ్నించారు.  

(6 / 6)

"తాము(కాంగ్రెస్) తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. 24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే..దేనికైనా సిద్ధం. మీరేం చేశారో.. మేమేం చేశామో మీడియా మిత్రుల సమక్షంలో చర్చకు సిద్ధమా..?" అని కేటీఆర్ ప్రశ్నించారు.  

WhatsApp channel

ఇతర గ్యాలరీలు