PM Fasal Bima Yojana : ఫసల్‌ బీమా యోజనలో చేరిన 'తెలంగాణ' - అమలు వివరాలివే-telangana state government adopted the pradhan mantri fasal bima yojana again read this details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Fasal Bima Yojana : ఫసల్‌ బీమా యోజనలో చేరిన 'తెలంగాణ' - అమలు వివరాలివే

PM Fasal Bima Yojana : ఫసల్‌ బీమా యోజనలో చేరిన 'తెలంగాణ' - అమలు వివరాలివే

Published Mar 02, 2024 08:18 AM IST Maheshwaram Mahendra Chary
Published Mar 02, 2024 08:18 AM IST

  • Pradhan Mantri Fasal Bima Yojana in Telangana : అన్నదాతలకు అలర్ట్ ఇచ్చింది  తెలంగాణ ప్రభుత్వం. రైతులకు ర‌క్షణగా నిలిచేందుకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (PMFBY)లో తిరిగి చేరింది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…..

ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌ స్కీమ్ లోకి తిరిగి తెలంగాణ‌ ప్రభుత్వం చేరింది. 

(1 / 6)

🌾ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్‌బీమా యోజ‌న‌ స్కీమ్ లోకి తిరిగి తెలంగాణ‌ ప్రభుత్వం చేరింది. 

(PMFBY Twitter)

2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ లో భాగమైంది.   ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉపసంహ‌రించుకుంది.

(2 / 6)

2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ లో భాగమైంది.   ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉపసంహ‌రించుకుంది.

(PMFBY Twitter)

శుక్రవారం రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్య‌ద‌ర్శి  రితేష్ చౌహాన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ఉన్న విష‌యం, ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉప సంహ‌రించుకున్న తీరుపై చ‌ర్చ జ‌రిగింది. 

(3 / 6)

శుక్రవారం రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్య‌ద‌ర్శి  రితేష్ చౌహాన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వ‌ర‌కు తెలంగాణ ఉన్న విష‌యం, ఆ త‌ర్వాత నాటి ప్ర‌భుత్వం దాని నుంచి ఉప సంహ‌రించుకున్న తీరుపై చ‌ర్చ జ‌రిగింది. 

(CMO Telangana Twitter)

పీఎంఎఫ్‌బీవైలోకి తెలంగాణ ప్ర‌భుత్వం తిరిగిచేర‌డంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని, పంట‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని  రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు

(4 / 6)

పీఎంఎఫ్‌బీవైలోకి తెలంగాణ ప్ర‌భుత్వం తిరిగిచేర‌డంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని, పంట‌లు న‌ష్ట‌పోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని  రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు

(CMO Telangana Twitter)

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు.

(5 / 6)

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు.

(PMFBY Twitter)

2016 వానాకాలం సీజన్‌ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం అమల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొమ్మును తమ వాటాగా భరిస్తాయి. అయితే ఈ స్కీమ్ అమలులో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువగా లాభాపడ్డాయనే వాదన ఉంది. ప్రీమియ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

(6 / 6)

2016 వానాకాలం సీజన్‌ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం అమల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొమ్మును తమ వాటాగా భరిస్తాయి. అయితే ఈ స్కీమ్ అమలులో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువగా లాభాపడ్డాయనే వాదన ఉంది. ప్రీమియ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు