(1 / 6)
నైరుతి రుతుపవనాలు.. కేరళను తాకినట్టు ఐఎండీ స్పష్టం చేసింది. కేరళవ్యాప్తంగా రుతపవనాల కదలికలకు అనువైన పరిస్థితి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో త్వరలోనే మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(@APSDMA Twitter)(2 / 6)
సాధారణం కన్నా రెండు రోజులు, ఐఎండీ అంచనాల కన్నా ఒక రోజు ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం విశేషం. సాధారణంగా.. ఈశాన్య భారతంలో జూన్ 5కు అటు, ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 30నే ప్రవేశించాయి. కొన్ని రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన రేమల్ తుపాను.. రుతుపవనాలను వేగంగా తీసుకొచ్చినట్టు వాతావరణ నిపుణులు చెప్పారు.
(@APSDMA Twitter)(3 / 6)
ఇక తెలంగాణలో చూస్తే గత రెండు మూడు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే మరోసారి హైదరాబాద్ వాతవరణ కేంద్రం ప్రజలకు చల్లని కబురు చెప్పింది. మే 31వ తేదీ నుంచి మళ్లీ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(@APSDMA Twitter)(4 / 6)
మే 31వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జూన్ 1 నుంచి 3 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(@APSDMA Twitter)(5 / 6)
ఇక తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ప్రవేశించి అవకాశం ఉంది. రెండో వారంలో రాష్ట్రం మొత్తం విస్తరించే ఛాన్స్ ఉంది.
(6 / 6)
మరోవైపు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో మాత్రం… గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 3వ తేదీ వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
(image source unshplash.com)ఇతర గ్యాలరీలు