(1 / 7)
రథసప్తమి సందర్భంగా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.
(https://news.tirumala.org/d)(2 / 7)
చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్లలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వాహనసేవలను తిలకించారు.
(https://news.tirumala.org/d)(3 / 7)
శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. షెడ్లకు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు.
(https://news.tirumala.org/d)(4 / 7)
శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.
(https://news.tirumala.org/d)(5 / 7)
భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
(https://news.tirumala.org/d)(6 / 7)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.
(https://news.tirumala.org/d)(7 / 7)
టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 10 వేల మంది భక్తులకు 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలందించారు. 2 మొబైల్ క్లినిక్ లు, 5 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని నాలుగు మూలల్లో నాలుగు వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు.
(https://news.tirumala.org/d)ఇతర గ్యాలరీలు