PM Modi Roadshow in Hyderabad : మల్కాజిగిరిలో మోదీ రోడ్ షో - రేపు నాగర్ కర్నూల్ లో భారీ సభ-pm narendra modi roadshow in malkajgiri lok sabha constituency in hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi Roadshow In Hyderabad : మల్కాజిగిరిలో మోదీ రోడ్ షో - రేపు నాగర్ కర్నూల్ లో భారీ సభ

PM Modi Roadshow in Hyderabad : మల్కాజిగిరిలో మోదీ రోడ్ షో - రేపు నాగర్ కర్నూల్ లో భారీ సభ

Published Mar 15, 2024 08:25 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 15, 2024 08:25 PM IST

  • PM Modi Roadshow in Hyderabad: ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన… మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ చేపట్టిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. 

శుక్రవారం సాయంత్రం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షా నిర్వహించారు.

(1 / 5)

శుక్రవారం సాయంత్రం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షా నిర్వహించారు.

సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు.  మోదీ ఉన్న వాహనంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే ఉన్నారు.

(2 / 5)

సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు.  మోదీ ఉన్న వాహనంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే ఉన్నారు.

మోదీకి మహిళలు ఘన స్వాగతం పలికారు. మోదీ నినాదాలతో హోరెత్తించారు.

(3 / 5)

మోదీకి మహిళలు ఘన స్వాగతం పలికారు. మోదీ నినాదాలతో హోరెత్తించారు.

మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు ఈ రోడ్ షో కొనసాగింది. దాదాపు 1.2 కిమీ మేర పరిధిలో గంటకుపైగా రోడ్ షో సాగింది. కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. 

(4 / 5)

మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు ఈ రోడ్ షో కొనసాగింది. దాదాపు 1.2 కిమీ మేర పరిధిలో గంటకుపైగా రోడ్ షో సాగింది. కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. 

రోడ్ షో తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు ప్రధాని మోదీ. శుక్రవారం రాజ్ భవన్ లోనే బస చేయనున్న ఆయన…. శనివారం (మార్చి 16) నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

(5 / 5)

రోడ్ షో తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు ప్రధాని మోదీ. శుక్రవారం రాజ్ భవన్ లోనే బస చేయనున్న ఆయన…. శనివారం (మార్చి 16) నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఇతర గ్యాలరీలు