(1 / 8)
జగన్ పాలనలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన విధ్వంసం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని, ఇప్పుడు జగన్ కు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే, ఏం మాట్లాడాలో తెలియక ప్రజల ముందు పశ్చాత్తాపం మాటలు, సింపతీ డైలాగులు కొడుతున్నాడని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. విజయవాడలో కూటమి తరపున ఎన్నికల పరచారం నిర్వహించారు.
(2 / 8)
వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల్లో దోచుకున్న లెక్కలు కూడా చెప్పాలని వంగవీటి రాధా ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేశారు.
(3 / 8)
అమరావతిలో బీజేపీ ప్రాతినిథ్యం కోసమే విజయవాడ సీటు వదులకున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
(4 / 8)
జగన్కు ఓటమి అర్ధమై ఏం చేయాలో తెలియక గొంతు నుంచి బేల మాటలు వస్తున్నాయని, స్వరంలో వణుకు మొదలైందని ప్రతిపక్షాలన్నీ కలిసి తనను ఓడించడానికి వస్తున్నాయని ప్రజల దగ్గర సింపతీ పొందాలని మాట్లాడుతున్నాడని పవన్ విమర్శించారు.
(5 / 8)
కూటమి అభ్యర్థుల తరపున విజవాడలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
(6 / 8)
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువత
(7 / 8)
రాష్ట్రంలో ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్నారని జగన్ మొత్తుకుంటున్నాడని.. అధికారులు బదిలీ కావడానికి జగన్ చేసిన తప్పులే కారణమని పవన్ విజయవాడలో విమర్శించారు.
(8 / 8)
విజయవాడ పంజా సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సభ
ఇతర గ్యాలరీలు