(1 / 6)
మధుమేహ సమస్య ఉన్న చాలామందిలో తిన్న ఆహారం జీర్ణం కాక.. కడుపు నొప్పి, సంబంధిత రుగ్మతలతో బాధపడుతుంటారు. అందుకే వారు నిర్ధిష్టమైన ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు నిపుణులు. సరైన డైట్ పాటించడం తప్పనిసరి అని చెప్తున్నారు.
(Pixabay)(2 / 6)
ఆయిల్ గ్రిల్డ్, జంక్ ఫుడ్ను అతిగా తినవద్దు. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
(Pixabay)(3 / 6)
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకే డిన్నర్ పూర్తి చేయండి. ఉదయం అల్పాహారం 8 గంటలకు, మధ్యాహ్న భోజనం 1 గంట తర్వాత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడానికి కనీసం 12 గంటల సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు.
(Shutterstock)(4 / 6)
సరైన నిద్ర లేనప్పుడు ఈ సమస్యలన్నీ వేగంగా పెరుగుతాయి. కాబట్టి మీరు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర ఉన్నప్పుడు మధుమేహ సమస్య అదుపులో ఉంటుంది.
(Pixabay)(5 / 6)
నెయ్యి వంటి మంచి కొవ్వు పదార్థాలు తినాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
(Shutterstock)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు