Janasena : జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు - కండువా కప్పిన పవన్-leaders of ycp joined jana sena in the presence of pawan kalyan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janasena : జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు - కండువా కప్పిన పవన్

Janasena : జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు - కండువా కప్పిన పవన్

Published Sep 26, 2024 07:46 PM IST Maheshwaram Mahendra Chary
Published Sep 26, 2024 07:46 PM IST

  • వైసీపీని వీడిన ముగ్గురు  కీలక నేతలు గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్యతో పాటు సామినేని ఉదయభానుకు పవన్ కల్యాణ్ కండువా కప్పారు. ఈ సందర్భంగా నేతల ముఖ్య అనుచరులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. 

ఇటీవలే వైసీపీని వీడిన ముగ్గురు  కీలక నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

(1 / 5)

ఇటీవలే వైసీపీని వీడిన ముగ్గురు  కీలక నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేనలో చేరారు.  విజయనగరం జిల్లా నుంచి అవనపు విక్రమ్ దంపతులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు.

(2 / 5)

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేనలో చేరారు.  విజయనగరం జిల్లా నుంచి అవనపు విక్రమ్ దంపతులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు.

కొత్తగా వచ్చిన నేతలకు  పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పాత, కొత్త అనే తేడా లేకుండా నేతలంతా కలిసి ఐక్యమత్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

(3 / 5)

కొత్తగా వచ్చిన నేతలకు  పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పాత, కొత్త అనే తేడా లేకుండా నేతలంతా కలిసి ఐక్యమత్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

నాయ‌కులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్ద కోలాహ‌లం కనిపించింది. వీరి చేరికల కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. 

(4 / 5)

నాయ‌కులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్ద కోలాహ‌లం కనిపించింది. వీరి చేరికల కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు.
 

ఇటీవలనే వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఎలాంటి డిమాండ్లు లేకుండానే జనసేనలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాత సామినేని ఉదయభానుతో పాటు కిలారి రోశయ్య కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

(5 / 5)

ఇటీవలనే వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఎలాంటి డిమాండ్లు లేకుండానే జనసేనలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాత సామినేని ఉదయభానుతో పాటు కిలారి రోశయ్య కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

ఇతర గ్యాలరీలు