(1 / 4)
తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
(2 / 4)
ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు నమూనాలను పరిశీలించారు.
(3 / 4)
బుధవారం రేవంత్ రెడ్డి జరిపిన సమీక్ష సమావేశానికి కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.
(4 / 4)
అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ గీతానికి సంగీత బాణీలను సమకూర్చే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. బుధవారం దీనిపై కూడా సీఎం రేవంత్ సమీక్షించారు. దాదాపు రాష్ట్ర గీతం రూపకల్పన ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు