(1 / 6)
(2 / 6)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు.
(image source from unsplash.com)(3 / 6)
'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. తొలి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.
(image source from unsplash.com)(4 / 6)
రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.
(image source from unsplash.com)(5 / 6)
నాల్గో రోజు Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.
(image source from unsplash.com)(6 / 6)
'COASTAL KARNATAKA' టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్ ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ధరలు తగ్గాయి. గతంలో కంఫార్ట్ క్లాస్ లోనే సింగిల్ అక్యుపెన్సీకి 40 వేలకు పైగా ధర ఉండేది.
ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085
(image source from unsplash.com)ఇతర గ్యాలరీలు