Coastal Karnataka Tour : 'కర్ణాటక' ట్రిప్... బడ్జెట్ ధరలోనే మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, పూర్తి వివరాలివే-irctc tourism operate hyderabad karnataka tour package in august month 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Coastal Karnataka Tour : 'కర్ణాటక' ట్రిప్... బడ్జెట్ ధరలోనే మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, పూర్తి వివరాలివే

Coastal Karnataka Tour : 'కర్ణాటక' ట్రిప్... బడ్జెట్ ధరలోనే మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, పూర్తి వివరాలివే

Published Aug 08, 2024 09:01 PM IST Maheshwaram Mahendra Chary
Published Aug 08, 2024 09:01 PM IST

  • Hyderabad Karnataka Tour Package: కర్ణాటకలో(Coastal)ని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC 'టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వెళ్లే తేదీలు, ధరలతో పాటు షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి……

కోస్టల్ కర్ణాటకలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలని అనుకునే వారికి ఐఆర్ సీటీసీ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

(1 / 6)

కోస్టల్ కర్ణాటకలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలని అనుకునే వారికి ఐఆర్ సీటీసీ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
(image source from unsplash.com)

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. 

(2 / 6)

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. 

(image source from unsplash.com)

'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. తొలి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.

(3 / 6)

'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. తొలి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.

(image source from unsplash.com)

రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.

(4 / 6)

రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.

(image source from unsplash.com)

నాల్గో రోజు  Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.

(5 / 6)

నాల్గో రోజు  Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.

(image source from unsplash.com)

'COASTAL KARNATAKA' టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…  సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/   వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.  మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ధరలు తగ్గాయి. గతంలో కంఫార్ట్ క్లాస్ లోనే సింగిల్ అక్యుపెన్సీకి 40 వేలకు పైగా ధర ఉండేది. ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 

(6 / 6)

'COASTAL KARNATAKA' టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…  సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/   వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.  మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ధరలు తగ్గాయి. గతంలో కంఫార్ట్ క్లాస్ లోనే సింగిల్ అక్యుపెన్సీకి 40 వేలకు పైగా ధర ఉండేది.

 

ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 

(image source from unsplash.com)

ఇతర గ్యాలరీలు