Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే-indrakiladri in vijayawada is getting ready for dasara navratri celebrations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే

Dasara Navaratri : ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు.. ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే

Published Sep 22, 2024 03:58 PM IST Basani Shiva Kumar
Published Sep 22, 2024 03:58 PM IST

  • Dasara Navaratri : బెజవాడలోని ఇంద్రకీలాద్రి.. దసరా నవరాత్రి ఉత్సవాల కోసం ముస్తాబవుతోంది. నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం.. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఈ మాట వినగానే అమ్మవారి భక్తులకు గుర్తొచ్చేది బెజవాడలోని ఇంద్రకీలాద్రి. ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

(1 / 5)

దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఈ మాట వినగానే అమ్మవారి భక్తులకు గుర్తొచ్చేది బెజవాడలోని ఇంద్రకీలాద్రి. ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు ఈ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ దుర్గమ్మ అవతారాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు.

(2 / 5)

దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు ఈ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ దుర్గమ్మ అవతారాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు.

అక్టోబర్ 3న అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ గా దర్శనమిస్తారని అధికారులు వివరించారు. 

(3 / 5)

అక్టోబర్ 3న అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ గా దర్శనమిస్తారని అధికారులు వివరించారు. 

అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 9న సరస్వతి , 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు.

(4 / 5)

అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 9న సరస్వతి , 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు.

మూలా నక్షత్రం రోజు అక్టోబర్ 9న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో.. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు వివరించారు.

(5 / 5)

మూలా నక్షత్రం రోజు అక్టోబర్ 9న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో.. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు వివరించారు.

ఇతర గ్యాలరీలు