
(1 / 7)
ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలను సోమవారం ఉదయం పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో క్రిస్మస్ నాడు ఉష్ణోగ్రతలు 8ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి.
(HT)
(2 / 7)
అమృత్సర్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు.. తీవ్రమైన చలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
(ANI )
(3 / 7)
గురుగ్రామ్లో ఈ సీజన్లోనే తొలి కోల్డ్ వేవ్ నమోదైంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి.
(Yogendra Kumar)
(4 / 7)
జమ్ములో మంచు కురుస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా ఇక్కడి రైల్వే, విమాన సేవలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బస్సు సేవల పరిస్థితి కూడా ఇంతే!
(PTI)
(5 / 7)
పట్నాలో కోల్డ్ వేవ్ కారణంగా 8వ తరగతి వరకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
(PTI)
(6 / 7)
కోల్కతాలో పరిస్థితులు ఇలా.. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ప్రయాణాలు కూడా కష్టంగా మారాయి.
(PTI)
(7 / 7)
జలంధర్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని స్కూళ్లకు జనవరి 21 వరకు ఓ వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. పాఠశాలలు ఉదయం 10 గంటల తర్వాత తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.
(Shammi Mehra)ఇతర గ్యాలరీలు