(1 / 5)
బాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ రూపొందించారు. ఇప్పటి వరకు ఎన్నో భారీ చిత్రాలను తెరకెక్కించిన భన్సాలీకి ఓటీటీలో ఇది తొలి వెబ్ సిరీస్.
(2 / 5)
హీరామండి వెబ్ సిరీస్లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరీ, రిచా చద్ధా, సంజీదా షేక్, షార్మీన్ సేగర్ ప్రధాన పాత్రలు పోషించారు.
(3 / 5)
హీరామండి వెబ్ సిరీస్ మే 1వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్పామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం, సంగీతం అందించటంతో పాటు భారీ బడ్జెట్తో స్వయంగా నిర్మించారు సంజయ్ లీలా భన్సాలీ.
(4 / 5)
పీరియడ్ డ్రామాగా హీరామండి సిరీస్ రూపొందింది. భారత స్వాతంత్య్రానికి ముందు 1940ల కాలం నాటి బ్యాక్డ్రాప్లో ఈ సిరీస్ ఉంటుంది. హీరామండి అనే రెడ్లైట్ ప్రాంతం గురించి, తవైఫ్స్ జీవితాలు, అక్కడి ఆధిపత్య పోరు సహా మరిన్ని అంశాల గురించి ఈ సిరీస్లో భన్సాలీ తెరకెక్కించారు.
(5 / 5)
2021లోనే హీరామండి వెబ్ సిరీస్ను సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. 2022 జూన్లోనే షూటింగ్ మొదలైంది. అయితే, వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2024 మే 1వ తేదీన ఈ గ్రాండ్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది.
ఇతర గ్యాలరీలు