(1 / 6)
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
సెప్టెంబర్ 20వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(3 / 6)
సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 6)
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
(5 / 6)
ఇవాళ(సెప్టెంబర్ 18) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
(6 / 6)
ఇక ఏపీలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు