(1 / 6)
చేపలు వండే ముందు పరిశుభ్రంగా కడగాలి. చేపల్లో ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిల్లో ఉండే బ్యాక్టిరియాలు వంటివి తొలగిపోతాయి.
(2 / 6)
భారతీయ వంటకాలు ఇతర దేశాలకు భిన్నంగా ఉంటాయి. చేపలను వండేముందు ఉప్పు, పసుపుతో నానబెట్టడం పూర్వం నుంచి అలవాటుగా వస్తోంది. పసుపు చేపలను చెడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.
(3 / 6)
పచ్చి చేపలను మ్యారినేట్ చేయడానికి పసుపును ఉపయోగించడం వల్ల యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు చేపలకు సోకుతాయి. ఇది సూక్ష్మజీవులను, ఇన్ఫెక్షన్లను చంపుతుంది. ఉప్పు, పసుపును నీటిలో వేసి ఆ నీటిలో చేపలను నానబెట్టాలి. తద్వారా చేపలు తాజాగా ఉంటాయి. ఇది సూక్ష్మజీవుల పునరుత్పత్తిని నిరోధిస్తుంది.
(4 / 6)
చేపలను ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేయడం వల్ల ప్రోటీన్ కంటెంట్ బయటకు పోకుండా ఉంటుంది. ఇది చేపలను తాజాగా ఉంచుతుంది. వండాక పులుసు రుచిని పెంచుతుంది.
(5 / 6)
పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.
(6 / 6)
పసుపు , ఉప్పుతో చేపలను కడగడం, చేపల పులుసు లేదా వేపుడు రుచిని పెంచుతుంది.
ఇతర గ్యాలరీలు