(1 / 4)
భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ దీర్ఘకాలిక ప్రభావాలపై బెనారస్ హిందూ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో మూడింట ఒక వంతు మందికి ఆరోగ్యసమస్యలు వస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కోవాగ్జిన్ తీసుకున్న ఏడాదిలోనే 30 శాతం మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
(2 / 4)
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమర్పించిన పరిశోధన నివేదిక ప్రకారం, కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న 926 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరిలో 30 శాతం మంది అనారోగ్య సమస్యలు వచ్చినట్టు గుర్తించారు. వీరిలో చాలా మందికి ఎగువ శ్వాసనాళంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. రక్తం గడ్డకట్టడం, అలెర్జీ సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
(HT_PRINT)(3 / 4)
కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న 1% మందికి స్ట్రోక్, గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ వచ్చినట్టు గుర్తించారు. 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు ఈ అధ్యయనం నిర్వహించారు. పరీక్షించిన వారిలో 635 మంది టీనేజీ యువత, 291 మంది పెద్ద వయసు వారు ఉన్నారు. చర్మ సమస్యలు, సాధారణ శారీరక సమస్యలు, న్యూరోలాజికల్ సమస్యలు టీనేజీ యువతలో కనిపించాయి. న్యూరోలాజికల్ సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలు పెద్దవారిలో నివేదించారు.
(4 / 4)
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, కౌమార బాలికలలో కూడా ఎఈఎస్ఐ సమస్య ఉంది. అలాంటప్పుడు టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చాయి. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి ఏఈఎస్ఐ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వాటి రిస్క్ 2 రెట్లు ఎక్కువ.
ఇతర గ్యాలరీలు