(1 / 8)
బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (మార్చి 26) గ్రాండ్గా జరిగింది. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. సరదాగా జోక్లు వేస్తూ కాసేపు నవ్వుకున్నారు.
(AFP)(2 / 8)
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అలయా ఎఫ్ కూడా నటిస్తున్నారు. ట్రైలర్ ఈవెంట్లో అలయాతో టైగర్ ష్రాఫ్ కెమెరాలకు పోజులు ఇచ్చారు. బడే మియా చోటే మియా సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
(3 / 8)
అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ నవ్వుతూ మెరిశారు. ఈ సినిమాతో రెండోసారి వారు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గతంలో సామ్రాట్ పృథ్విరాజ్ మూవీలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.
(4 / 8)
అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్, అలయా ఎఫ్, టైగర్ ష్రాఫ్ నలుగురు కలిసి కెమెరాలకు పోజులు ఇచ్చారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్ర చేశారు.
(5 / 8)
బడే మియా చోటే మియా మూవీ టీమ్ కలిసి ఫొటోలు దిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సరదాగా సాగింది. ఇద్దరు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. అక్షయ్, టైగర్ ఈ చిత్రంలో ఆఫీసర్ల పాత్ర పోషించారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో కీరోల్ చేశారు.
(6 / 8)
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అక్షయ్, పృథ్విరాజ్ సుకుమారన్ కరచాలనం చేసుకున్న దృశ్యమిది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రమోషన్లను చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది.
(7 / 8)
బడే మియా చోటే మియా చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ముంబై, లండన్, స్కాట్ల్యాండ్, జోర్డాన్లోని లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ చేశారు.
(8 / 8)
బడే మియా చోటే మియా చిత్రాన్ని వషు భగ్నానీ, దీప్షికా దేశ్ముఖ్, జాకీ భగ్నానీ, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 10వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది.
ఇతర గ్యాలరీలు