Two CRPF jawans killed: గుజరాత్ లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్చివేత-two crpf jawans on poll duty killed in firing by colleague in gujarat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Two Crpf Jawans On Poll Duty Killed In Firing By Colleague In Gujarat

Two CRPF jawans killed: గుజరాత్ లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్చివేత

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 11:26 PM IST

Two CRPF jawans killed: ఎన్నికల డ్యూటీపై వచ్చి గుజరాత్ లోని పోరుబందర్ లో విధుల్లో ఉన్న సీఆర్ పీఎఫ్ జవాన్ల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం రెండు ప్రాణాలను బలిగొన్నది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Two CRPF jawans killed: మణిపూర్ లోని సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ కు చెందిన జవాన్లు ఎన్నికల డ్యూటీ కోసం గుజరాత్ వెళ్లారు. వారికి పోరు బందరు సమీపంలోని తుడ్క గొస గ్రామంలో డ్యూటీ వేశారు. అక్కడే ఉన్న ఒక తుపాను సహాయక కేంద్రంలో వారికి బస ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Two CRPF jawans killed: చిన్న గొడవ పెద్దదై..

శనివారం సాయంత్రం వారి మధ్య చిన్న వాగ్వాదం ప్రారంభమై, క్రమంగా తీవ్రమైంది. దాంతో, క్షణికావేశంలో ఒక జవాను సహచరులపై తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎం శర్మ తెలిపారు. పోర్ బందర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశలోనే జరగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో జరగనున్నాయి.

IPL_Entry_Point