Manipur violence : మణిపూర్​లో మళ్లీ అలజడులు.. ఇద్దరు మృతి- 25మందికి గాయాలు!-manipur violence 2 killed 25 injured in protest over cops selfie ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Violence : మణిపూర్​లో మళ్లీ అలజడులు.. ఇద్దరు మృతి- 25మందికి గాయాలు!

Manipur violence : మణిపూర్​లో మళ్లీ అలజడులు.. ఇద్దరు మృతి- 25మందికి గాయాలు!

Sharath Chitturi HT Telugu
Feb 16, 2024 07:34 AM IST

Manipur violence latest news : మణిపూర్​లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 25మంది గాయపడ్డారు.

మణిపూర్​లో మళ్లీ అలజడులు.. ఇద్దరు మృతి- 25మందికి గాయాలు!
మణిపూర్​లో మళ్లీ అలజడులు.. ఇద్దరు మృతి- 25మందికి గాయాలు! (HT_PRINT)

Manipur violence death toll : మణిపూర్​లో మరోమారు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చూరచంద్​పూర్​ జిల్లాలో భద్రతా దళాలు- స్థానికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మంది గాయపడ్డారు. ఓ స్థానిక హెడ్​ కానిస్టేబుల్​.. సాయుధులతో సెల్ఫీ దిగడం, అతడిపై సస్పెన్షన్​​ వేటు పడటం.. ఈ హింసాత్మక ఘటనకు కారణం!

మణిపూర్​లో మళ్లీ ఉద్రిక్తత..!

మణిపూర్​లోని విలేజ్​ డిఫెన్స్​ వాలంటీర్లు, సాయుధ దళాలు ఉండే ఓ బంకర్​ వద్దకు వెళ్లాడు సియంలాల్​పౌల్​ అనే హెడ్​ కానిస్టేబుల్​. వారితో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ ఫొటో.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫలితంగా.. అతడిపై పోలీసు అధికారులు సస్పెన్షన్​ వేటు వేశారు. అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని.. స్థానికులు నిరసనలు చేపట్టారు. చూరచంద్​పూర్​లోని ఎస్​పీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

Manipur violence latest news : నిరసనలు అదుపు తప్పాయి. నిరసనకారులు ఓ బస్సుకు నిప్పంటించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం బయట వాహనాలకు మంటలు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

మరోవైపు.. మణిపూర్​ హింసాత్మక ఘటన నేపథ్యంలో చూరచంద్​పూర్​ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్​ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం.

Manipur violence reason : "ఫిబ్రవరి 14న.. సంబంధిత హెడ్​ కానిస్టేబుల్​ సాయుధులతో కలిసి వీడియో చేశాడు. అది వైరల్​గా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాము. ప్రస్తుతానికి సస్పెండ్​ చేశాము," అని చూరచంద్​పూర్​ ఎస్​పీ శివానంద్​ సుర్వె తెలిపారు.

అయితే.. హెడ్​ కానిస్టేబుల్​ని అన్యాయంగా విధుల నుంచి తప్పించారని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఆయనపై వేసిన సస్పెన్ష్​ని వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కుకీ తెగ- పోలీసుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తామ గ్రామాలపై పోలీసులు కావాలనే దాడి చేస్తున్నారని కుకీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను పోలీసులు తిప్పి కొట్టారు. సాయుధులతో కుకీ ప్రజలు చేతులు కలుపుతున్నారని అంటున్నారు.

Latest violence in Manipur : కొంతమంది సాయుధులు.. తమని తాము 'విలేజ్​ డిఫెన్స్​ వాలంటీర్లు'గా పిలుచుకుంటున్నారు. అయితే.. వీరిలో వీరికే గొడవలు కనిపిస్తున్నాయి. ఒక వర్గం వారు.. మరో వర్గం వారిపై దాడులు చేసుకుంటున్నారు. మైతీ- కుకి వర్గాల మధ్యో తీవ్ర విభేదాలతో ఇప్పటికే మణిపూర్​లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో.. తాజా పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి.

గతేడాది మే నెలలో కుకి- మైతీ తెగల మధ్య మణిపూర్​లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇప్పటివరకు 180మంది మరణించారు. 50వేల మందిపై నిరసనల ప్రభావం పడింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం