Banks | బ్యాంకులపై ఆర్బీఐకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
- దేశంలో బ్యాంకులపై ప్రజల అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ బ్యాంకులపై ఆర్బీఐకి ఏకంగా 3.41 లక్షల ఫిర్యాదులు అందడం గమనార్హం.
- దేశంలో బ్యాంకులపై ప్రజల అసంతృప్తి పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ బ్యాంకులపై ఆర్బీఐకి ఏకంగా 3.41 లక్షల ఫిర్యాదులు అందడం గమనార్హం.
(1 / 5)
ప్రతి ఏటా దేశంలోని బ్యాంకులపై ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఆర్బీఐ అంబుడ్స్మన్ దగ్గర ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.(MINT_PRINT)
(2 / 5)
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3 లక్షల 41 వేలకుపైగా ఫిర్యాదులు ఆర్బీఐ దగ్గర దాఖలయ్యాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.(REUTERS)
(3 / 5)
ఈ ఫిర్యాదుల్లో 80 శాతం మెట్రోపాలిటన్ నగరాలు, అర్బన్ ప్రాంతాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం.(PTI)
(4 / 5)
మొత్తం ఫిర్యాదుల్లో 29.51 శాతం అంటే లక్షా 755 కేసులు జాతీయ బ్యాంకులపై దాఖలైనవే. ఇక 36 శాతం అంటే 1,27,303 ఫిర్యాదులు ప్రైవేటు బ్యాంకులపై దాఖలయ్యాయి. జాతీయ బ్యాంకులపై దాఖలైన ఫిర్యాదుల్లో 22 శాతం ఒక్క ఎస్బీఐపై దాఖలైనవే.(bloomberg)
(5 / 5)
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకూ పెన్షన్ చెల్లింపులకు సంబంధించినవే. ఈ ఫిర్యాదుల్లో 15 శాతం ఖాతాలకు సంబంధించినవి, 14 శాతం డెబిట్ లేదా ఏటీఎం కార్డులకు సంబంధించినవి ఉన్నాయి. ఇక పారా బ్యాంకింగ్, బ్యాంకు నోట్లు, కాయిన్లు, బ్యాంకులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి.(HT_PRINT)
ఇతర గ్యాలరీలు