Ganesh Chaturthi 2022 : గణేశ్​ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువుల ఏర్పాటు!-ganesh chaturthi 2022 bmc makes 162 artificial ponds for ganpati visarjan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ganesh Chaturthi 2022: Bmc Makes 162 Artificial Ponds For Ganpati Visarjan

Ganesh Chaturthi 2022 : గణేశ్​ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువుల ఏర్పాటు!

Sharath Chitturi HT Telugu
Sep 02, 2022 10:45 AM IST

Ganesh Chaturthi 2022 : గణేశ్​ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీఎంసీ ఓ ప్రకటన చేసింది.

గణేశ్​ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువుల ఏర్పాటు!
గణేశ్​ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువుల ఏర్పాటు! (AP)

Ganesh Chaturthi 2022 : గణేశ్​ నిమజ్జం వేళ కాలుష్యాన్ని తగ్గించేందుకు బృహన్​ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​(బీఎంసీ) చర్యలు చేపట్టింది. ఈ ఏడాది గణేశ్​ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వీటితో పాటు గణేశ్​ నిమజ్జనం కోసం మరో 73 ప్రాంతాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్(పీఓపీ)​తో తయారు చేసిన గణేశ్​ విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యం పెరిగిపోతోందని గత కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. వినాయక విగ్రహాల్లో ఇంకా పీఓపీని వినియోగిస్తున్నారు. దీనిని గ్రహించిన బీఎంసీ.. కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తోంది. పీఓపీతో తయారు చేసిన గణేశ్​ విగ్రహాలను కృత్రిమ చెరువుల్లో నిమజ్జనం చేయాలని పిలుపునిస్తోంది.

Ganesh visarjan : "ప్రకృతి పరంగా ఏర్పడిన 73 ప్రాంతాలతో పాటు ఈసారి 162 కృత్రిమ చెరువులను కూడా గణేశ్​ నిమజ్జనం కోసం ఏర్పాటు చేశాము. లైఫ్​గార్డులు, క్రేన్​లతో పాటు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాము. నగరవాసులు కృత్రిమ చెరువులను వినియోగించుకోవాలి," అని బీఎంసీ పిలుపునిచ్చింది.

దేశవ్యాప్తంగా ఆగస్టు 31న వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. కాగా.. ముంబైలో ఒక్క గురువారమే 22,687 గణేశ్​ విగ్రహాల నిమజ్జం కృత్రిమ చెరువుల్లో జరిగింది.

జియోమార్ట్​లో ప్రసాదాలు..

Prasad in Jiomart : ముంబైలో లాల్​బాగ్చా రాజా గణేశ్​ చాలా ప్రసిద్ధి. ఆ విగ్రహాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు ముంబైకి తరలివెళాతరు. అయితే.. ఈసారి పీటీఎం, జియోమార్ట్​తో కలిసిన సిబ్బంది.. భక్తులకు ఆన్​లైన్​ సేవలను అందిస్తోంది.

Ganesh Prasad in Paytm : జియోమార్ట్​లో రెండు లడ్డూలు.. ప్రసాదాలుగా ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. ముంబై, నవీ ముంబై, ఠాణె ప్రాంతాల వారికే ఈ ఆన్​లైన్​ సేవలు ఇస్తున్నారు. ఇక ప్రసాదాల కోసం పేటీఎంలో ఆర్డర్​ చేసుకోవచ్చు. 250గ్రాముల డ్రైఫ్రూట్​ లడ్డూ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

గణేశ్​ మండపం కోసం రూ. 316కోట్ల బీమా..!

GSB seva mandal insurance : ముంబైలో గణేశ్​ ఉత్సవాల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే.. ముంబైలోని జీఎస్​బీ సేవా మండల్​కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ జీఎస్​బీ సేవా మండల్​.. గణేశ్​ ఉత్సవాల కోసం ఏకంగా రూ. 316.40కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది!

ముంబై కింగ్​ సర్కిల్​లోని అత్యంత సంపన్నమైన వినాయకుడి మండపాల్లో ఈ జీఎస్​బీ సేవా మండల్​ ఒకటి. ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు.. ఇక్కడి గణేశుడిని దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగానే జీఎస్​బీ సేవా మండల్​ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రమంలోనే కార్యకలాపాలకు సంబంధించి బీమాలు కూడా తీసుకుంటారు. ఈసారి అత్యధికంగా.. రూ. 316.40కోట్ల బీమాను తీసుకున్నారు. జీఎస్​బీ సేవా మండల్​ చరిత్రలో ఇదే అత్యధిక బీమా మొత్తం అని సభ్యులు వివరించారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్