Boat capsizes in Brahmaputra: బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రమాదం; 10 మంది గల్లంతు-boat capsizes in assam s dhubri at least 10 people missing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Boat Capsizes In Brahmaputra: బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రమాదం; 10 మంది గల్లంతు

Boat capsizes in Brahmaputra: బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రమాదం; 10 మంది గల్లంతు

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 10:10 PM IST

Boat capsizes in Brahmaputra: అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గురువారం పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారు.

బ్రహ్మపుత్ర నది
బ్రహ్మపుత్ర నది

Boat capsizes in Brahmaputra: అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా తయారైన ఒక చెక్క పడవపై 29 మంది ప్రయాణిస్తుండగా బ్రహ్మపుత్ర నదిలో ఆ పడవ మునిగి పోయింది. ఒక వంతెన పిల్లర్ ను ఆ పడవ ఢీ కొని మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Boat capsizes in Brahmaputra: ప్రభుత్వ అధికారులు కూడా..

ఆ పడవలో కొందరు గ్రామస్తులు, పలువురు విద్యార్థులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ధుబ్రి సర్కిల్ ఆఫీసర్ సంజు దాస్, ఒక రెవెన్యూ ఉద్యోగి, అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారి ఆ బోటులో ప్రయాణిస్తున్నారు. వారిలో సంజు దాస్ గల్లంతయ్యారు. మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. బ్రహ్మపుత్ర నదీ తీరంలో కొన్ని పరీక్షలు చేయడానికి ఆ అధికారులు బయల్దేరగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే, స్థానిక అధికారులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 20 మంది వరకు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని, దాదాపు 10 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

IPL_Entry_Point