Gold and silver prices today: తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా-gold and silver prices today 24th august 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today: తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా

Gold and silver prices today: తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు కూడా

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. ప్లాటినం రేట్లు సైతం శనివారం తగ్గాయి. హైదరాబాద్ సహా పలు నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

Gold and silver prices today: దేశంలో బంగారం ధరలు శనివారం మరింత తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,590కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 66,60గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,65,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,659గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 72,640కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,650గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,26,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,264గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,790గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,640గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,640గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,690గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా ఉంది.

బంగారంపై కస్టం డ్యూటీ తగ్గించడం, ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,660గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 86,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 86,700గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,600.. బెంగళూరులో రూ. 81,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 250 తగ్గి.. రూ 25,680కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,930గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,680గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.