కర్ణాటకలో ఎన్నికల వేల డబ్బు వరదలా పారుతోంది. కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఆటోలో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేష్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.