విభజన చట్టంలో చాలా వరకు చేసేశాం: కేంద్రం-andhra pradesh reorganisation act at various stages of implementation says centre ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విభజన చట్టంలో చాలా వరకు చేసేశాం: కేంద్రం

విభజన చట్టంలో చాలా వరకు చేసేశాం: కేంద్రం

HT Telugu Desk HT Telugu
Feb 02, 2022 03:57 PM IST

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని చాలా నిబంధనలను అమలు చేశామని, ఇంకా కొన్ని వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

కేంద్ర హోం శాఖ కార్యాలయం
కేంద్ర హోం శాఖ కార్యాలయం (HT_PRINT)

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనల్లో చాలావరకు అమలులోకి వచ్చాయని, మిగిలిన నిబంధనల అమలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం బుధవారం తెలిపింది.

‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు ఎక్కువ భాగం అమలులోకి వచ్చాయి. మిగిలిన నిబంధనల అమలు వివిధ దశలలో ఉంది..’ అని హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభకు తెలిపారు.

‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల పరస్పర ఒప్పందం అవసరమయ్యే కొన్ని అంశాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడటానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.

నేటి నుంచి రాజ్యసభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశమవుతుంది.

పార్లమెంట్ 2022 బడ్జెట్ సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు, రెండవ భాగం మార్చి 14 నుండి ఏప్రిల్ 8 వరకు జరుగుతుంది. 

 

IPL_Entry_Point

సంబంధిత కథనం