తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. హుజురాబాద్ పార్టీ నేతల విషయంపై మొదలైన వివాదం… రోజురోజుకూ ముదురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.