మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న ఠాక్రే కజిన్స్.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలవబోతున్నారా? అన్న ప్రశ్న రాష్ట రాజకీయ వర్గాల్లో ఇటీవల తరచుగా వినిపిస్తోంది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు కారణమయ్యాయి.