ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కొత్త పెన్షన్ల జారీకి అనుమతులు లభించాయి. ఏపీలో ప్రభుత్వ సామాజిక పెన్షన్లు పెద్ద ఎత్తున అనర్హులకు అందుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అర్హత ఉన్న వారికి కూడా పెన్షన్లు అందడం లేదని గుర్తించారు.