
మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని మాల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన… శుభ్రమైన తాగునీటి కోసం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ వేగంగా పెరిగిపోతుండటంతో… నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.



