కూటమిని అధికారంలోకి తెచ్చిన కీలక హామీల అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని బాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.