
విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా ఇది ఉండనుంది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ యూఎస్డీ 10 బిలియన్లను (సుమారు రూ. 84 వేల కోట్లు) విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడి పెట్టనుంది.



